29, ఆగస్టు 2012, బుధవారం

బాలీవుడ్ స్టార్లకు కాసులు కురిపిస్తున్న బుల్లితెర

 ఈ మధ్య ఏ నేషనల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ చూసినా బాలీవుడ్ స్టార్లతో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. మరి బాలీవుడ్ హీరోహీరోయిన్లంతా బుల్లితెర బాట పట్టడానికి కారణమేంటి? బిగ్ స్క్రీన్ బోర్ కొట్టిందా? లేక స్మాల్ స్క్రీన్ పై మోజు పెరిగిందా? ఇవేవీ కావు... బుల్లితెర బాలీవుడ్ హీరోలకు కాసులు కురిపిస్తోంది. అందుకే బాలీవుడ్ స్టార్లంతా స్మాల్ స్క్రీన్ బాట పట్టారు. త్వరలో కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 6తో అమితాబ్, బిగ్ బాస్ సీజన్ 6తో సల్మాన్ ఖాన్ బుల్లితెరపై మరోమారు సందడి చేయనున్నారు. 
  ఏ ముహూర్తాన అమితాబ్ బుల్లితెరపై అడుగుపెట్టారోగానీ అప్పటి నుంచి బాలీవుడ్ స్టార్లకు స్మాల్ స్క్రీన్ పై బాగా కలిసొస్తోంది. యాంకర్లుగా, హోస్టులుగా రాణిస్తున్నారు. అంతేకాదు సినిమాలకు వసూలు చేసినదానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
      సత్యమేవ జయతే ప్రోగ్రాం ద్వారా సామాజిక సమస్యలను లేవనెత్తి దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్న అమీర్ ఖాన్. వారానికి ఒకసారి ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి కోట్లాది మంది వీక్షకులున్నారు. సత్యమేవ జయతే ప్రతి ఎపిసోడ్ కు అమీర్ ఖాన్ తీసుకుంటున్న పారితోషికం దాదాపు మూడున్నర కోట్లు. అంటే నెలలో నాలుగు ఎపిసోడ్లు చేస్తే... అతడికి వచ్చే  రెమ్యూనరేషన్ 28 కోట్లు. ఒక సినిమా నెలరోజుల్లో కంప్లీట్ కాదు. అంటే ఒకసినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే అన్నమాట.
           హ్రుతిక్ రోషన్ కూడా ఏ హై జల్వా షోకి వచ్చాడు. ఈ హీరో వారానికి 2 కోట్ల చొప్పున అందుకున్నాడు. హ్రుతిక్... జస్ట్ డ్యాన్స్ షో మొత్తం ఎపిసోడ్ లకు కలిపి 112 కోట్లు అందుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.
      బాలీవుడ్ హీరోల టెలివిజన్ ఎంట్రీ ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి షోకు మొదట్లో ఎపిసోడ్ కు 50 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారు. ఈ రియాలిటీ గేమ్ షో ఊహించినదానికంటే ఎక్కువ పాపులర్ కావడంతో... ఇక రెండో సీజన్ లో రేటు పెంచేశారు అమితాబ్. ఒక్కో ఎపిసోడ్ కి కోటి డిమాండ్ చేశారు. ఆ తర్వాత బిగ్ బి ద్రుష్టి బిగ్ బాస్ రియాలిటీ షోపై పడింది. ఈ ప్రోగ్రాంను నిర్వహించేందుకు సింగిల్ ఎపిసోడ్ కు కోటి 75 లక్షలు అందుకున్నారు.   
         ఇక కౌన్ బనేగా కరోడ్ పతి మూడో సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించిన కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ భారీ పారితోషికాన్నే అందుకున్నాడు. మూడో సీజన్ అన్ని ఎపిసోడ్ లకు కలిపి 75కోట్లు అందుకున్నాడు. ఆ తర్వాత క్యా ఆప్ పాంచ్ వీ పాస్ సె తేజ్ హై అంటూ మరో షో చేశాడు షారుక్. వీటికి ఎపిసోడ్ కి కోటి చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
            వీరి తర్వాత కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా దస్ కా దమ్ అంటూ స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. ఎపిసోడ్ కి కోటి రూపాయల చొప్పున డిమాండ్ చేశాడు. మొత్తం 30 ఎపిసోడ్లు చేశాడు. ఆ తరువాత రెండో సీజన్ లో రేటు కాస్త తగ్గించారు నిర్వాహకులు. దీంతో ఎపిసోడ్ కి 80 లక్షల చొప్పును మాత్రమే అందుకున్నాడు సల్మాన్. 
          డేర్ డెవిల్ రియాలిటీ షో ఖత్రోంకే ఖిలాడీకి హోస్ట్ గా చేశాడు అక్షయ్ కుమార్. అందుకు వారానికి కోటి 25 లక్షలు వసూలు చేశాడు. కానీ ఇదే షో రెండో సీజన్ లో ఎపిసోడ్ కు 95 లక్షలతో సరిపెట్టుకున్నాడు. అయితే వంటల ప్రోగ్రాం మాస్టర్ షెఫ్ ఇండియాకు భారీగానే డిమాండ్ చేశాడు. ఎపిసోడ్ కు కోటిన్నర అందుకున్నాడు.
         అందరికంటే కాస్త ఆలస్యంగా బుల్లితెరపై అడుపెట్టాడు ఛోటా బచ్చన్ అభిషేక్. నేషనల్ బింగో నైట్ రియాలిటీ షో చేసి ఎపిసోడ్ కు కోటి రూపాయలు అందుకున్నాడు.
             హీరోలే కాదు హీరోయిన్లు కూడా రియాలిటీ షోలలో సత్తా చాటారు. అక్షయ్ కుమార్ చేసిన ఖత్రోంకే ఖిలాడీని కంటిన్యూ చేసింది ప్రియాంకా చోప్రా. అందుకోసం ఎపిసోడ్ కు 60 లక్షలు అందుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షోను రక్తికట్టించిన శిల్పాశెట్టి... వారానికి 45 లక్షల చొప్పున వెనకేసుకుంది. ప్రీతీజింటా కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంటూ ఒక షో చేసింది. ఎపిసోడ్ కు 45 లక్షల చొప్పున అందుకుంది. అటు బిగ్ స్క్రీన్ పై ఇటు స్మాల్ స్క్రీన్ పై అదరగొట్టిన ఈహీరోహీరోయిన్లు... స్టార్లు ఎక్కడున్నా స్టార్లే అని నిరూపిస్తున్నారు. అభిమానులను అలరిస్తూ... కాలవలసినంత వెనకేసుకుంటున్నారు.
         బిగ్ స్టార్లు స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తుండడంతో టీఆర్పీలు అమాంతం పెరిగిపోతున్నాయి. అందుకే రియాలిటీ షోల నిర్వాహకులు బడాస్టార్లపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి