6, సెప్టెంబర్ 2012, గురువారం

కౌన్ బనేగా కరోడ్ పతి వచ్చేసింది

 రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే రియాలిటీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి ఈరోజు(శుక్రవారం)నుంచి వచ్చేస్తోంది. ఈ షోలో ఇంట్లో కూర్చుని ప్రోగ్రాం చూసే ప్రేక్షకులను సైతం ఇన్వాల్వ్ చేస్తోంది సోనీ టీవీ. ఘర్ బైటే జీతో జాక్ పాట్ అంటూ రిజిస్ట్రేషన్లను ఇటీవలే ముగించింది. కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) సీజన్6తో అందరినీ అలరించడానికి బిగ్ బి రెడీ అయ్యాడు. ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే అతి పెద్ద రియాలిటీ మనీ గేమ్ షో ఇది. పేరుకు తగ్గట్లే ఇప్పటికే కొంతమందిని కోటీశ్వరులను... మరెంతోమందిని లక్షాధికారులను చేసింది. మేనెలలో రిజిస్ట్రేషన్లు ముగించిన కేబీసీ... సరికొత్తగా రూపుదిద్దుకుంది. వారంలో మూడు రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాలు రోజూ రాత్రి 8.30 గంటలకు ఈ ప్రోగ్రాం అలరించనుంది.
         కేబీసీలో పాల్గొనే చాన్స్ రాలేదని నిరాశపడే ప్రేక్షకులకు సోనీ టీవీ మరో ఛాన్స్ ఇస్తోంది. ఘర్ బైటే జీతో జాక్ పాట్ పేరుతో మళ్లీ రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తోంది. ఈ కాంటెస్ట్ లో ఆడియన్స్ ఇంట్లో కూర్చునే షో మధ్యలో అడిగే ప్రశ్నలకు సమాధానం పంపాల్సి ఉంటుంది. ఇందులో రాండంగా సెలక్షన్ చేస్తారు. ఎంపికయితే... ప్రైజ్ మనీగా లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇస్తారు. ఘర్ బైటే జీతో జాక్ పాట్... గత 5 సీజన్లకంటే భిన్నం. ఇక ఈ షో విజేతకు రూ.5 కోట్ల ప్రైజ్ మనీ వస్తుంది. సీజన్ 5లో బీహార్ కు చెందిన సుశీల్ కుమార్ రూ.5 కోట్లు గెలుచుకుని విజేతగా నిలిచాడు. 
   2000 సంవత్సరంలో రూపం పోసుకున్న ఈ గేమ్ షోకు మూలం యునైటెడ్ కింగ్డమ్ లోని హూవాంట్స్ టు బి ఎ మిలియనీర్ ప్రోగ్రాం. కేబీసీని స్టార్ ఛానెల్ ప్రసారం చేసినప్పుడు దేశంలో ఓ పెద్ద సంచలనం. దీనికి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.... యాంకరింగ్ చేయడం మరో సంచలనం. అప్పటివరకూ టీవీల్లో యాడ్స్ లో మాత్రమే కనిపించే బిగ్ బి... బుల్లితెర యాంకర్ గా మారడం నిజంగా చర్చనీయాంశమైంది. ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన ఈ షో... ఫస్ట  సీజన్ నుంచి గత 5 సీజన్ల వరకు సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఒక్క మూడో సీజన్ లో తప్ప బిగ్ బి.... అన్ని సీజన్లకు తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ అదరగొడుతున్నారు. అంతేకాదు కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ గేమ్ షోకు మంచి పాపులారిటీ తెచ్చారనడంలో సందేహం లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి